హైదరాబాద్

మైనార్టీలకు అండగా కెసిఆర్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మార్చి 22: కెసిఆర్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెరాస సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న కెసిఆర్ వెనుకబడిన బిసి ఎస్సీ ఎస్టీలతోపాటు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం హిందువులకే కాదు మైనార్టీలైన ముస్లిం, క్రిష్టియన్‌లకు కూడ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ముస్లిం సోదరీమణులకు షాదీముబారక్‌తోపాటు మసీద్‌ల మరమ్మతులతోపాటు అర్హులైన వారికి జీతాలు ఇస్తున్నారని అన్నారు. తాజాగా మైనార్టీలు అక్షరాశ్యతతోనే అభివృద్ధి సాధిస్తారని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా 70 మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది పాలకులు వచ్చినా మైనార్టీలకు అరచేతిలో వైకుంఠం చూపించారు తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు. చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని కేవలం కెసిఆర్ ఒక్కరేనని సింగిరెడ్డి పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాలకు మాత్రమే ప్రజల మద్దతు ఉంటుందని ప్రజలు కూడ నిరూపిస్తున్నారని గుర్తుచేశారు.