హైదరాబాద్

21న పలు ప్రాంతాల్లో నీటి సరఫరాబంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: శివార్లలోని పటాన్‌చెరులో కొత్తగా నిర్మించిన రిజార్వాయర్ జంక్షన్ పనుల కారణంగా ఈ నెల 21న ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. శంకర్‌నగర్, భవానీనగర్, కైలాశ్‌నగర్, ఆర్‌ఆర్‌కాలనీ, సురక్ష, ఫ్రెండ్స్ కాలనీ, గౌతమ్‌నగర్, వేముకుంట, జవహర్‌నగర్, దీప్తిశ్రీనగర్, ఎంఏ నగర్, మియాపూర్, జేపీనగర్, హెచ్‌ఎంటీ, శాంతినగర్, డీకే ఎంక్లేవ్, న్యూ కాలనీ, జన నివాసిత ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, బొల్లారం, హైదర్‌నగర్, ధర్మారెడ్డినగర్, కేపీహెచ్‌బీకాలనీ, భాగ్యనగర్‌కాలనీ, వసంతనగర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించాలని కూడా అధికారులు కోరారు.