క్రైమ్/లీగల్

మద్యం మత్తులో యువతి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 18: మద్యం మత్తులో యువతి కారును వేగంగా నడిపి యాక్టివాను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన రాయదుర్గ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొరబండలో రామాయణం శ్రీనివాసులు నివాసముంటున్నాడు. అతని కుమారుడు చిరంజీవి(20) జూమోటో ఫుడ్ డెలీవరీలో డెలీవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చిరంజీవి స్నేహితుడు సాయికుమార్(20)తో కలిసి హోండా యాక్టివాపై వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన క్రేటా కారు ఢీకొట్టింది. సంఘటనలో చిరంజీవి అక్కడక్కడే మృతిచెందగా తీవ్రగాయాలైన సాయికుమార్‌ని గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సాయికుమార్‌ని పరీక్షించిన వైద్యులు ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కారు నడిపిన యువతి కోకాపేటలోని గ్రీన్ బ్లూహోమ్స్‌లో నివాసముండే జానీ జాకబ్(26) అని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారు మద్యం సేవించి ఉన్నట్లు, జానీ జాకబ్ సీఏ చదువుతున్నట్లు పోలీసులు వివరించారు. కేసును రాయదుర్గం ఎస్‌ఐ కిషన్‌సింగ్ దర్యాప్తు చేస్తున్నారు