హైదరాబాద్

బాక్సర్ హుసాముద్దీన్‌ను సత్కరించిన ఆర్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అంధించిన నాయబ్ సుబేధా, బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్‌ను సికింద్రాబాద్‌లోని వన్ ఈఎంఈ సెంటర్‌లో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంసీఎంఈ కామాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ విచ్చేసి కామెనె్వల్త్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించన మహ్మద్‌ను సత్కరించి అభినందించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో నిర్వహించిన కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అంధించిన హుసాముసద్దీన్ దేశానికే గర్వకారణమన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రీల్ 21 : నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం ఆల్వీన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.194.29 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
మాట్లాడుతూ.. ఆల్వీన్‌కాలనీ ఫేజ్-1లో రూ.24.19 లక్షలతో, షంషీగూడలో రూ.65.1 లక్షలతొ, ఆల్వీన్‌కాలనీ ఫేజ్-2లో రూ.45 లక్షలతొ, విజయనగర్‌కాలనీలో రూ. 9.99 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, తులసీనగర్‌లో రూ.35 లక్షలతోనిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఈ కృష్ణ, ఎఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మం, నాయకులు సంజీవ రెడ్డి, లద్దె నాగరాజు, బాల్‌రాజు, రామకృష్ణ గౌడ్, కాశీనాథ్‌యాదవ్, భాస్కర్, చిన్నోళ్ల శ్రీను, శివరాజ్ గౌడ్, రామకృష్ణ, మున్నా, సమ్మారెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో 60శాతం నిధులు కేంద్రానివే
* పంచాయతీల బలోపేతానికి 14వ ఆర్థిక సంఘం నిధులు* బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన అందులో 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవే ఉంటాయని బీజేపీ తెలంగాణ విమోచన కమిటి చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి వివరించారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ రంగంపల్లిలో బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ కక్కునూరి వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులను భారీ స్థాయిలో విడుదల చేసిందని వివరించారు. సర్పంచుల పదవీ కాలం ముగిస్తున్నా నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్కరూపాయి కూడా రాలేదని వాపోయారు. గ్రామాలలో నిర్మించుకునే మరుగుదొడ్లకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నట్లు వివరించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తుందని, ఆ నిధులను పనులకు వినియోగించుకుండా పక్కదారి మళ్లీంచి రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు ఉపయోగిస్తుందని వివరించారు. ఈ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమిత్‌షా బృందాలు పర్యటనలు కొనసాగిస్తున్నాయని, ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ మనోహర్ రెడ్డి, బాబుదోర, ప్రకాష్‌చారి, నారాయణ, శివరాజు, పాపయ్య, సురేష్, యాదయ్య, మురేందర్, విష్ణుకాంత్, హన్మంతు పాల్గొన్నారు.