హైదరాబాద్

పురానాపూల్‌లో బస్సు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: పాతబస్తీలోని పురానాపూల్‌లో ఆదివారం సాయంత్రం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఓ మెడికల్ షాపులోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హుస్సేని ఆలం పోలీసు ఇన్స్‌పెక్టర్ ఎ బాలాజి కథనం ప్రకారం.. ఇబ్రాహిం పట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు (ఎపి 09ఎక్స్ 755) ఆదివారం సాయంత్రం గం. 5.30ల ప్రాంతంలో సిటీ కాలేజి నుంచి కిషన్‌బాగ్ వైపు వెళ్తున్న క్రమంలో స్టీరింగ్ పనిచేయకపోవడంతో బస్సు అదుపు తప్పి పురానాపూల్ వద్దగల బాబా సాయి మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో మందుల కోసం వచ్చిన మురళీనగర్‌కు చెందిన శివకళాబాయి (60) అక్కడికక్కడే మృతి చెందింది. అదేవిధంగా ధూల్‌పేటకు చెందిన ప్రేమబాయి కాలు విరిగింది. ఉస్మాన్ బాగ్‌కు చెందిన బషీర్ (32)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.