క్రైమ్/లీగల్

భార్య చేయి నరికిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, అక్టోబర్ 19: బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇన్‌స్పెక్టర్ బుచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రసూల్‌పురకు చెందిన భార్యాభర్తలు రెహమాన్, కౌసర్ బేగం 8 సంవత్సరాల కింది వీరికి వివాహం జరిగింది. రెహమాన్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక కౌసర్ బేగం అదే ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దనే ఉండి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
గురువారం రెహమాన్ భార్య ఉంటున్న ఇంటికి వచ్చి మామా, అత్త, భార్యతో గొడవకు దిగాడు. ఈ విషయంపై స్థానిక బేగంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. అంతలోనే రెహమాన్ పోలీసుస్టేషన్ ఎదురుగానే భార్యను పట్టుకుని కొబ్బరిబోండం కత్తితో చేయి నరికాడు. అత్తమామలను గాయపరిచాడు, దీంతో అప్రమత్తమైన పోలీసులు రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని సిఐ బుచ్చయ్య తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని యువతి మృతి
ఉప్పల్, అక్టోబర్ 19: ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో కింద పడిపోయిన యువతిపై నుండి కారు వెళ్లగా అక్కడి కక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈస్ట్ గోదావరి, పెద్ధాపురానికి చెందిన సీ వినూష (23) సాప్ట్‌వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంది. నగరంలోని అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌లో నివాసముంటుంది. రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ అనే యువకునితో వినూషకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. శనివారం ఇద్ధరు కలిసి యాదగిరి గుట్ట వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. ఉప్పల్ బస్టాండ్ వద్ధకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్ధరు క్రింద పడిపోయారు. వెనుక నుండి అతి వేగంగా వచ్చిన కారు ఇద్ధరినీ ఢీకొట్టింది. వినూషకు తీవ్రంగా గాయాలు కావటంతో అక్కడి కక్కడే మృతి చెందింది. . ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నారు.