హైదరాబాద్

బోరబండలో కిడ్నాపైన బాలుడు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: నగరంలోని బోరబండలో గత నెల 14న కిడ్నాపైన రెండేళ్ల బాలుడు రహ్మాన్ క్షేమంగా ఉన్నాడు. బాలుడిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. రెండు లక్షలు ఇస్తేనే బాలుడిని అప్పగిస్తామని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‌లో ఐదుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా పూర్తి వివరాలు బోరబండ పోలీసులు సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.
నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా సభ్యుడు అరెస్టు
నగరంలో నకిలీ సర్ట్ఫికెట్లు విక్రయిస్తున్న ఓ ముఠా సభ్యుడిని ఆదివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్ట్ఫికెట్లు జారీ చేస్తూ అమాయకుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సత్యనారాయణ అనే ముఠా సభ్యుడిని పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో ఎంతమందికి నకిలీ సర్ట్ఫికెట్లు ఇచ్చాడు. ముఠాలో ఎవరెవరున్నది అనే సమాచారాన్ని రాబడుతున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు.