హైదరాబాద్

‘చదువుల చెలమ’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ రచయిత ఎల్‌ఆర్ వెంకట రమణ రచించిన ‘చదువుల చెలమ’ పుస్తకావిష్కరణ సభ కిరణ్ సాంస్కతిక సమాఖ్య, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక సత్యాన్ని చాటడానికి రచయిత పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులకు అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. పుస్తకంలో ఉన్న కథలు ప్రతి పాఠశాలలో ఉండాలని అన్నారు. వెంకటరమణ రాసిన కథలు ప్రణాళికా బద్ధమైనవని తెలిపారు. ఆచార్య టీ.గౌరి శంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎస్‌ఆర్‌కే రెడ్డి, సాహితీ కిరణం మేనేజర్ పొత్తూరి విజయలక్ష్మీ, సంస్థ అధ్యక్షుడు లంకా వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
కళామాధురి ఆర్ట్స్ నూతన సంస్థ ప్రారంభం
కాచిగూడ, నవంబర్ 17: కళా మాధురి ఆర్ట్స్ నూతన సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ‘జాబిలితో చెప్పనా..’ పేరిట సినీ సంగీత విభావరి శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గాయకుడు త్రినాథరావు, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, కినె్నర రఘురామ్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజ రావు, పద్మావతి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు.