హైదరాబాద్

సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను సరైన ఓటర్ లిస్టు లేకుండా నిర్వహించారని ఎన్నికల నిఘా వేదిక నిర్వహించిన సమావేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక ఇటీవల జరిగిన ఎన్నికలపై సమీక్ష-సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో ఎన్నికల నిఘా వేదిక వీవీ.రావు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి, రావు, రామ్‌మోహన్‌రావుతో పాటు 30 స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉన్నా కమిషన్ హడావుడిగా నిర్వహించిందన్నారు. తొందర పాటు వల్ల ఓటర్ల జాబితా సరిచేయడం సాధ్యం కాలేదని సాక్షాత్తు ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సైతం సక్రమంగా అమలు చేయలేదని వాపోయారు. అభ్యర్థుల నేర చరిత్రను తప్పని సరిగా వెల్లడించాలని, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమపై ఉన్న కేసులను విధిగా మూడు పర్యాయాలు పత్రికల ద్వారా ప్రజలకు వివరించాల్సి ఉన్నా ఇలా జరగేలేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిఘా వేదిక పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగింది, వాటిని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బుకు వందరేట్లు పంపిణీ జరిగి ఉండవచ్చునని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. రానున్న పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.