హైదరాబాద్

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో రానున్న అయిదేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో తలసాని ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస వౌలిక వసతులు అందించటం, అభివృద్ధి పనులను చేపట్టడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అధికారులు కూడా ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరాలో, డ్రైనేజీ వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పలు చోట్ల డ్రైనేజీ, మంచినీటి సమస్యకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటిని సరఫరా చేసే వేళలను ఉద్యోగులు, కార్మికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య సముదాయాలకు కమర్షియల్ కనెక్షన్లు ఇవ్వటం, టెండర్ల ప్రక్రియలో యువత పాత్రను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ అధికారులు సనత్‌నగర్ నియోజకవర్గంతో పాటు ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఈడీ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు ఎల్లాస్వామి, బి.విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.