హైదరాబాద్

ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను గడుపులోగా పరిష్కరించి, ఫిర్యాదు దారునికి సమాచారం పంపాలన్నారు. పరిష్కరించిన వాటిని ప్రజావాణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్ ఇండ్ల కేటాయింపులు, పెన్షన్లు, భూసమస్యలు, రుణమంజూరు, రుణమాఫీ, ఆహార భద్రతా కార్డు తదితర అంశాలపై 54 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.