హైదరాబాద్

23న జన్మనిచ్చిన జననికి జయంత్యోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మాతృమూర్తి గొప్పతనాన్ని నేటి యువతకు తెలియజేసే ఉన్నత లక్ష్యంతో ఈనెల 23న శిల్పారామంలో జన్మనిచ్చిన జననికి జయంతోత్సవం వేడుకను నిర్వహిస్తున్నట్టు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ తెలిపింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్లు మధుశ్రీ, లక్ష్మి ఆవిష్కరించారు. వేదాలకు పుట్టినిల్లు భారతదేశంలో తల్లికి ఎంతో విశిష్ట స్థానం ఉందని అన్నారు. పాశ్చాత్య పోకడలతో తల్లి విలువలను మరిచి కొంత మంది నిర్లక్ష్యం చేస్తుండటం ఎంతో ఆవేదన కలిగిలించే అంశం అన్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లిని చివరి రోజుల్లో శారీరక, మానసిక వేదనకు గురిచేయడం యావత్ సమాజానికి చేటు అని అన్నారు. ఈ నేపథ్యంలో యువతకు తల్లి ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నైతిక విలువలను పెంపొందించేందుకు శ్రీశ్రీ ఆత్మానందమయి సూచనల మేరకు శిల్పారామంలోని సాంప్రదాయ వేదికలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో శృతికీర్తన, ప్రభాకర్ పాల్గొన్నారు.