హైదరాబాద్

దిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీమహంకాళి దేవలయ కమిటీ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డిని ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఆదివారం కిషన్ రెడ్డిని రాజ్ భవన్ రోడ్డులోని దిల్‌కుష్ అతిథి గృహంలో లాల్‌దర్వాజా ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు, కమిటీ ఉపాధ్యక్షుడు కే.వెంకటేష్‌తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు జీ.మహేష్ గౌడ్, చిరంజీవి, శేషు నారాయణతో కూడిన బృందం ఆహ్వాన పత్రికను అందజేశారు. వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో దిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగే లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కిషన్ రెడ్డి స్పందిస్తూ దిల్లీలో జరిగే బోనాల ఉత్సవాల్లో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు.