హైదరాబాద్

23, 24న పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరానికి కృష్ణా జలాలను తీసుకువచ్చే కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు పలు చోట్ల లీకులు ఏర్పడటంతో, వాటికి అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నందున ఈ నెల 23, 24వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజైన 24వ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు అంతరాయం ఏర్పడవచ్చు, లేక సరఫరా బంద్ కావచ్చునని అధికారులు పేర్కొన్నారు. సాహెబ్‌నగర్, ఆటోనగర్, వైశాలినగర్, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, శాస్ర్తీపురం, బండ్లగూడ, బుద్వేల్, సులేవర్ణన్‌నగర్, హైదర్‌గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్‌పేట, ప్రశాసన్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలీ, మణికొండ, నార్సింగి, బోడుప్పల్, చెంగిచెర్ల ఫీర్జాదిగూడ, సైనిక్‌పురి, వౌలాలి, లాలాపేట, స్నేహపురికాలనీ, కైలాస్‌గిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. 23 ఉదయం ఆరు గంటల నుంచి 24వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మంచినీటిలో అంతరాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తించి, వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించి, బోర్డుకు సహకరించాలని జలమండలి అధికారులు కోరుతున్నారు.