హైదరాబాద్

టూరిజంపై మంత్రి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బేగంపేటలోని పర్యాటక భవన్‌లో తెలంగాణ టూరిజంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. యాదాద్రిలో అత్యద్భుతంగా నిర్మిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద 90 ఎకరాలన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు అప్పగించడం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు తగిన ప్రణాళికలను సిద్దం చేయాలని మంత్రి అదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుపుతున్న పలు పర్యాక ప్రాజెక్టులను సమీక్షా నిర్వహించారు. శామిర్‌పెట్, హుస్సేన్ సాగర్, గండిపేట, బుద్వేల్ వంటి జలాశయాల వద్ద నూతన ప్రాజెక్టులను రూపొందించాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.