హైదరాబాద్

నిమ్స్ ప్రొఫెసర్ మీనా కుమారి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: నిమ్స్ ఆసుపత్రి న్యూరో ఫీజిషీయన్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ మీనా కుమారి లండన్‌లో కన్నుమూశారు. లండన్‌లో నిర్వహించిన న్యూరో సదస్సుకు హజరయ్యేందుకు ఇటీవలే వెళ్లారు. అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రసంగిస్తూ మీనా కుమారి గుండెపోటుకు గురయ్యారు. మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలి పొయారు. బ్రిటన్ అధికారులు తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన ప్రముఖ వైద్యురాలిని బతికించేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చికిత్స పొందుతూ లండన్ నగరంలోనే తుదిశ్వాస విడిచారు. తమ దేశంలో జరిగిన సదస్సుకు హాజరై సభా వేదికపైనే వైద్యురాలు కుప్పకూలిపొయి మృతిచెందడం తీవ్రంగా కలిచి వేసే అంశమని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశం కాని దేశంలో సదస్సుకు హాజరై మీనా కుమారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు, నిమ్స్ వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్బాంతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎండీ వైద్య విద్యను పూర్తి చేసి గత 25 ఏళ్లుగా నిమ్స్‌లో సేవలందిస్తున్నారు.