హైదరాబాద్

ప్రశాంతంగా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కీసర, వికారాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో శనివారం నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘ న విజయం సాధించింది. అంతటా కారు జోరు కనిపించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 83.23 శాతం . మేడ్చల్‌లో 89.8 శాతం, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 74 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 22 సహకార సంఘాలకు గాను కుల్కచర్ల, ఎక్‌మామిడి, హుస్నాబాద్ సహకార సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 19 సహకార సంఘాల డైరెక్టర్ స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. 45,973 మంది ఓటర్లు ఉండగా, 34,022 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధిక స్థానాలు టీ ఆర్ ఎస్ మద్దతు దారులే కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.