హైదరాబాద్

ఆంధ్రాశ్రమానికి ప్రధాని అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఆదివారం కాశీలోని శ్రీరామతారక ఆంధ్రాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్ర్తీ కలిశారు. జంగంబాడి మఠాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా మోదీని ట్రస్టీ సుందర శాస్ర్తీ కలిసి ఆంధ్రాశ్రమం చేపట్టిన కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కల్పిస్తున్న వసతి సదుపాయాలు, అన్నదానం వివరాలను తెలియచేశారు. హిందూ ధార్మిక ప్రచారానికి ఆంధ్రాశ్రమం చేస్తున్న కృషిని ప్రధానికి తెలిపారు. ఆంధ్రాశ్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు వస్తారని, వారికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పండితులు, నిర్వాహకులు పాల్గొన్నారు.