హైదరాబాద్

మోదీ పాలనలో అభివృద్ధి పథంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 27: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లిందని తెలంగాణ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ మోండ్ర కొమరయ్య ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈనెల 29న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. రాజేంద్రనగర్‌కు రాబోతున్నట్లు తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రెండు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం నిర్వహిస్తామని, అమిత్‌షా ముఖ్యఅతిథిగా రానున్నట్లు వెల్లడించారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక స్థితిగతులు దృఢమయ్యాయని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే విధంగా నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. 29న సాయంత్రం శాతంరాయ్ ఎస్‌ఎస్ కనె్వన్షన్‌లో జరిగే సమావేశానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేమ్‌రాజ్, వై.శ్రీ్ధర్, ఎన్.మల్లారెడ్డి, రాచూరి రాజశేఖర్, జె.రవి, పి.మల్లేష్ యాదవ్, కడియం సుధాకర్, సోమారం ప్రేమ్, కిరణ్‌చారి, ఎస్.విజయ్‌కుమార్, అడికె జనార్దన్, నవారు మురళీధర్‌రెడ్డి, బాలకృష్ణ, జయానంద్‌రెడ్డి, బాబు, నరేందర్‌రెడ్డి, భవానీ, రాహుల్‌రెడ్డి, బొమ్మరాజు నర్సింహ్మా, కిషన్ యాదవ్, దీపక్ పాల్గొన్నారు.