జాతీయ వార్తలు
ఆర్థిక మందగమనం భారత్పై అధికం:ఐఎంఎఫ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 October 2019
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మందగమనంలో పయనిస్తున్నాయని, ఈ ప్రభావం భారత్పై అధికంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా తెలిపారు. ఈ ఏడాదే ఆ ప్రభావం కనిపిస్తుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరీ అత్యల్పంగా ఉంటుందన్నారు. దాదాపు 90 శాతం ప్రపంచ దేశాలు నత్తనడకన వృద్ధి రేటును కొనసాగిస్తాయన్నారు. అమెరికా, జర్మనీ దేశాల్లో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉందన్నారు. భారత్, బ్రెజిల్ లాంటి ఎదుగుతున్న మార్కెట్ వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉంటుందన్నారు.