జాతీయ వార్తలు

మోదీ సందేశంపై ఇమ్రాన్ ట్వీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ పంపిన సందేశం అందిందని ఇమ్రాన్‌ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈమేరకు మోదీ పంపిన గ్రీటింగ్ సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘పాక్ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఉగ్రవాద హింసారహితంగా భారత ఉపఖండాన్ని అభివృద్ధిచేసేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశానికి ఇమ్రాన్‌ఖాన్ ఆహ్వానం పలుకుతూ రెండు దేశాల మధ్య శాంతి సౌఖ్యాల కోసం కొత్త బంధాలను రచించాల్సిన అవసరం ఉందని అన్నారు.