అంతర్జాతీయం

లోయలోపడ్డ బస్సు: 30 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, జూన్ 15: మేఘాలయలోని సోనాపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ నైనిటాల్ హిల్స్ జిల్లాలో ఒక బస్సు లోయలోపడి 30 మంది దుర్మరణం చెందారు. 11 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని మేఘాలయ డిజిపి రాజీవ్ మెహతా చెప్పారు. బస్సు అస్సాం రాజధాని గౌహతి నుంచి వస్తుండగా సోనాపూర్ వద్ద లోయలో పడిపోయిందన్నారు. ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్న బిఎస్‌ఎఫ్ సిబ్బంది స్థానికుల సహకారంతో ఎనిమిది మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మిగతా మృతదేహాలను వెలికితీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.