అంతర్జాతీయం

భారత్-పాక్ శాంతి బావుటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది. గతంలో కుదిరిన ఉమ్మడి చర్చల ప్రక్రియ స్థానే సమగ్ర చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య బ్యాంకాక్‌లో జరిగిన సమావేశం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. అంతకు ముందు అనేక సార్లు భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన చర్చలు కూడా ఈ శాంతి చర్చల శకానికి ఊతాన్నిచ్చాయి.