అంతర్జాతీయం

‘హ్యాట్రిక్’ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో శుక్రవారం భారత క్రీడాకారులు కదం తొక్కారు. ఒకే రోజు ఏకంగా మూడు అద్భుత విజయాలతో సరికొత్త అధ్యాయం సృష్టించారు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టుతో మొదలైన ఈ విజయాల పరంపర చివరకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ‘మెన్ ఇన్ బ్లూ’తో ముగిసింది. మూడు మ్యాచ్‌ల మహిళల ట్వంటీ- 20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ సేన 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి కంగారూలపై తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకోగా, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ గ్రాండ్‌శ్లామ్ కిరీటాన్ని అందుకున్నారు. అలాగే మూడు మ్యాచ్‌ల ట్వంటీ- 20 క్రికెట్ సిరీస్‌లో ధోనీ సేన 27 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించి ఆస్ట్రేలియాలో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. ఈ విజయాలన్నీ మెల్బోర్న్‌లోనే నమోదవడం కొసమెరుపు.