అంతర్జాతీయం

క్రికెట్ స్టేడియంలో పేలుళ్లు: 8మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఓ క్రికెట్ స్టేడియంలో జరిగిన పేలుళ్లలో ఎనిమిది మంది మరణించారు. జలాలాబాద్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు తెగబడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అనేక మంది మ్యాచ్ చూస్తుండగా పేలుళ్లు సంభవించాయని నాన్‌గర్‌హర్ ప్రభుత్వ ప్రతినిధి అత్తాహుల్ ఖోగ్యానీ వెల్లడించారు. వరుస పేలుళ్లలో 8 మంది చనిపోగా 45 మంది గాయపడ్డారన్నారు. పేలుళ్లపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే పేలుళ్లకు తమదే బాధ్యత అంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. తూర్పు ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రత్యేకించి నాన్‌గర్‌హర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల హింస పెచ్చరిల్లుతోంది.