అంతర్జాతీయం

పరిశుభ్ర భవితకు ఉమ్మడి దార్శనికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు సంవత్సరాల క్రితం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2019 నాటికి ‘పరిశుభ్రమైన భారతావని’’ లక్ష్యాన్ని సాధించే దార్శనికతతో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. అందుకు తగినట్టుగానే, 2019, అక్టోబర్ 2వ తేదీ పరిశుభ్రత జాతీయ ప్రాధాన్యతగా ఉండాలంటూ ఎలుగెత్తి చాటిన మహాత్మాగాంధీ జయంతి వార్షికోత్సవం అవుతోంది. గడచిన నాలుగేళ్లలో పరిశుభ్రత విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. 86 మిలియన్ ఇళ్లలో టాయిలెట్లు నిర్మించారు. సుమారు 5 లక్షల (4,70,000) గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించారు.
సింగపూర్ కూడా ఇలాంటి ప్రయాణమే సాగించింది. స్వాతంత్య్రానం తరం మేము మా ప్రజలకు పరిశుభ్రమైన, హరిత నివాస పరిసరాలను కల్పించేందుకు ఎంతో కష్టపడి పనిచేశాం. తొలినాళ్లలో ఎన్నో ఇళ్లలో మురుగు తొలగించే సౌకర్యం ఉండేది కాదు. మలవిసర్జితాలను బక్కెట్లలో సేకరించి వాటిని ట్ర క్కుల ద్వారా మురుగు శుద్ధి ప్లాంట్లకు తరలించే వారు. తరచూ ఈ మలవిసర్జితాలను దగ్గరలో ని నీటి ప్రవాహాలలో, నదులలో వదలడం వల్ల ఆయా జలాలు కలుషితమై విషపూరిత మవుతూ వచ్చాయి. అపరిశుభ్రమైన జీవన పరిస్థితులు ఎన్నో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యాయి.
ఇలాంటి పరిస్థితులలో మా దేశ నిర్మాత లు నిర్ణయాత్మక చర్యలకు తీర్మానించారు. పరిశుభ్ర సింగపూర్‌కు వారు జాతీయస్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. మేము ప్రతి ఇంటిని పరిశుభ్రం చేసుకున్నాం. మా నదులను పరిశుభ్రం చేశాం. అలా సింగపూర్ సిటీని పరిశుభ్రమైన, హరిత నగరం గా మార్చాం. బ్యాక్‌యార్డ్ పరిశ్రమలను, పందుల ఫారాలను, నదీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యానికి కారణమైన ఎన్నింటినో తొలగించాం. ఇవాళ స్వచ్ఛమైన నది, సింగపూర్ నగరం గుండా ప్రవహించి రిజర్వాయర్‌లో కలుస్తున్నది. ఇది మా జాతీయ నీటి సరఫరా వ్యవస్థకు ఆధారంగా ఉంది.
సింగపూర్‌తో పోలిస్తే భారత్ కచ్చితంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ది. గంగానది సింగపూర్ నది కంటే దాదాపు వెయ్యి రెట్లు పెద్దది. అయినా పరిశుభ్రతా ప్రయాణంలో ఇండియా, సింగపూర్‌లకు పోలికలు ఉన్నాయి.
ముందుగా ఇరు దేశాల అనుభవాలు, దేశ దార్శనికత, నాయకత్వ ప్రాధా న్యతను ప్రస్ఫుటం చేస్తున్నాయి. దివంగత సింగపూర్ ప్రధానమంత్రి లీ కాన్ యూ, భారత ప్రధాని మోదీలిద్దరూ తమ దేశం పరిశుభ్రంగా, ఆకుపచ్చగా ఉండాలన్నది తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. వారు ఈ విషయంలో ప్రచా రం నిర్వహించడానికి, ప్రజలను కూడగట్టడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. ఇరువురు నేతలూ ప్రజల తో కలిసి వీధులు శుభ్రం చేయడానికి చీపుర్లు చేతపట్టారు. లీ తనకు వ్యక్తిగ తంగా ప్రేరణ అని, మనం ఉన్న తీరులో మార్పు తేవడం ద్వారా దేశ పరివర్తన సాధించవచ్చన్న లీ ఆలోచన నుంచి స్ఫూర్తి పొందానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆ రకంగా స్వచ్ఛ్భారత్ మిషన్ కేవలం భారతదేశ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆలోచన, మన పని, మన జీవన విధానంలో పరివర్తన తెచ్చే లోతైన సంస్కరణ.
ఇక రెండవది- విజయం సాధించాలంటే అందుకు జాతీయస్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధత ఉండాలి. సింగపూర్ తమ మురుగునీరు, నీటిపారుదల నెట్‌వర్క్‌లను వేరు చేసే సీవరేజ్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసింది. దీని లక్ష్యం, వర్షపు నీరు కలుషితం కాకుండా నిరోధించడం, ఈ నీటిని సేకరించి సద్వినియోగం చేసుకోవడం. అదే సమయంలో సింగపూర్ ఒకసారి వాడిన నీటిని మురుగునీటి శుద్ధి యూనిట్‌లలో శుద్ధి చేసి తిరిగి వాడుతుంది. ఈ నీటిని రివర్స్ ఆస్మోసిస్ ద్వారా శుద్ధిచేసి ఎన్.ఇ. వాటర్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇది అత్యంత పరిశుభ్రంగా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన తాగునీరుగా ఉంటుంది. అయతే, ఒకసారి వాడిన నీటిని ఏం చేయాలన్న సమస్యకూ పరిష్కారం సాధించాం. ఇది నీటి కొరత అనే మరో సమస్యకు కూడా పరిష్కారం అయింది.
భారత్‌లో, వివిధ వర్గాల భాగస్వాములతో అం టే పారిశ్రామిక సంస్థలు, పాఠశాలలు వంటివాటితో కలిసి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ అమ లును ముందుకు తీసుకుపోవడం ఆశాజనక మైన ఫలితాలనిచ్చింది. 2006లో 50శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుధ్య సౌకర్యాలు ఉండగా, ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో సౌకర్యాల కల్పన జరిగిందని 2018 యునిసెఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, హైజిన్ ఇన్ స్కూల్స్- గ్లోబల్ బేస్‌లైన్ రిపోర్ట్ వెల్లడించింది.
మూడోది - సింగపూర్, ఇండియాలు రెండూ అంతర్జాతీయ సహకారానికి విలువనిస్తాయి. ఒకచోట పరిష్కారం అనుకున్నది మరో దేశంలో పనిచేయకపోవ చ్చు. కానీ మనం ఇతరులనుంచి నేర్చుకోవడం, వారి అనుభవాల ను పంచుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. మహాత్మాగాంధీ ఇంట ర్నేషనల్ శానిటేషన్ కనె్వన్షన్ ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చినందుకు భారత్‌ను అభినందిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ప్రాక్టీషనర్లు, నాయకులను పారిశుధ్య రంగంలో తమ అనుభవాల గాథలను పంచుకో వడానికి వారిని ఒకచోట చేర్చింది. సింగపూర్ కూడా ద్వైవార్షిక ప్రపంచ నగ రాల శిఖరాగ్ర సమ్మేళనం, సింగపూర్ అంతర్జాతీయ జల వారోత్సవం వంటి అంతర్జాతీయ వేదికలకు ఆతిథ్యమిస్తోంది. 2013లో ప్రపంచ పారిశుధ్య సవాలుపై అవగాహన కల్పించడానికి, నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డేను గుర్తుచేసుకుంటూ ఐక్యరాజ్యసమితి, అందరికీ పారిశుధ్యం పేరుతో సింగపూర్ తీర్మానం చేసింది.
ఇండియా మరింత మెరుగైన జీవనానికి, దేశ వ్యాప్తంగా సుస్థిర స్మార్ట్ నగరాల అభివృద్ధి కొనసాగిస్తున్నందున సింగపూర్ తన అనుభవాలను ఇండియాతో పంచుకోవడం సంతోషంగా భావిస్తోంది. నగర ప్లానింగ్, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వందలాది మంది అధికారులకు శిక్షణ ఇవ్వడానికి సింగపూర్, భారత దేశ టౌన్, కంట్రీ ప్లానింగ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ నగరాలను అభివృద్ధి చేసుకోవడానికి, నగరాల సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించడంలో సహకారం అందించడానికి సింగపూర్ ఎదురుచూస్తోంది.
స్వచ్ఛ్భారత్ మిషన్ విషయంలో భారత ప్రజలకు, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
లీ సియన్ లూంగ్
- సింగపూర్ ప్రధాన మంత్రి