అంతర్జాతీయం

సాక్ష్యాధారాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, డిసెంబర్ 15: పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైలులో జరిగిన భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్ హత్యకేసులో ప్రధాన నిందుతులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2013లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఐదేళ్ల తరువాత లాహోర్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పును వెలువరించింది. కోర్టు వర్గాల కథనం ప్రకారం సరబ్‌జిత్ సింగ్ హత్యకేసులో అమీర్ తంబా, మదస్సార్‌లు ప్రధాన నిందితులు. సంచలం రేపిన ఈ కేసులో సాక్షులందరూ ప్రాసిక్యూషన్‌కు ఎదురుతిరిగారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరూ ముందుకురాలేదు. లాహోర్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కేసులో ఐదేళ్లు నడిచింది. భద్రతాకారణాల దృష్ట్యా నిందితులు ఇద్దర్నీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. కోట్ లఖ్‌పట్ సెంట్రల్ జైలులో 49 ఏళ్ల సరబ్‌జిత్‌సింగ్‌ను హత్య చేసిన అమీర్ తంటా, మదస్సార్‌పై సాక్ష్యాధారాలు లభిస్తే మరణశిక్ష పడాల్సి ఉంది. ఇంతకు ముందు కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయలేకపోయారని జడ్జి తీవ్రంగా మండిపడ్డారు. సరబ్‌జిత్ అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించడం చూశానని ఓ సాక్షి కోర్టుకు వివరించాడు. సింగ్ నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే వైద్యులు అడ్డుకున్నారని అతడు ఆరోపించాడు. ఈ కేసులో జస్టిస్ మజార్ అలీ అక్బర్ నఖ్వీ సారధ్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను లాహోర్ కోర్టు ఏర్పాటు చేసింది. 40 మంది సాక్ష్యులను జస్టిస్ సఖ్వీ విచారించారు. సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అయితే నివేదిక ఇప్పటికీ బహిర్గం చేయలేదు. అలాగే విదేశీ మంత్వ్రశాఖ ద్వారా సరబ్‌జిత్ సింగ్ బంధువులకు ఏకసభ్య కమిషన్ నోటీసులు జారీ చేసింది.
అయితే సింగ్ కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని అధికారులు వెల్లడించారు. తంబా, మదస్సార్ కమిషన్ ముందు తమ నేరాన్ని అంగీకరించారు. లాహోర్, ఫైసాలాబాద్ బాంబు పేలుళ్లలో అమాయకుల మృతికి సరబ్‌జిత్ కారణమని వారు ఆరోపించారు. అందుకే కసితో జైలులోనే చంపేశామని ఒప్పుకున్నారు. 1990లో పంజాబ్ రాష్ట్రంలో బాంబు పేలుళ్ల ఘటనతో సరబ్‌జిత్ సంబంధాలున్నాయంటూ ఉరిశిక్ష విధించారు. కాగా కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ లాహోర్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ మొయిన్ ఖధోర్కర్ నిందితులిద్దర్నీ నిర్దోషులుగా ప్రకటించారు.