అంతర్జాతీయం

తీరుమారని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, డిసెంబర్ 22: పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని పోనిచ్చుకోలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరెస్‌కు ఫోన్‌చేసి కాశ్మీర్ అంశాన్నిప్రస్తావించినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ చెప్పారు. ఇంతకంటే మించిన సమాచారం తన వద్ద లేదని ఆయన చెప్పారు. కాని చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారన్నారు. కాగా ఈ అంశంపై భారత్ ధీటుగా స్పందించింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని , ఈ అంశంపై చర్చలకు తావులేదని పేర్కొంది. కాగా అధికార ప్రతినిధి విలేఖర్లతో మాట్లాడుతూ భద్రత మండలి ఆదేశం మేరకు ఒక పరిశీలన బృందం మాత్రం ఈ అంశాలను పరిశీలిస్తుంటుందని చెప్పారు. యుఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇండియా, పాకిస్తాన్ ఈ విధులు నిర్వహిస్తుందన్నారు. సాధారణంగా వివిధ దేశాల అధినేతలు ఐరాస సెక్రటరీ జనరల్‌తో మాట్లాడుతుంటారని చెప్పారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపై మాట్లాడారన్నారు. కాశ్మీరీలు తమ భవితను నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని తాను కోరినట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఐరాస సమావేశంలో కాశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాక్ దుష్టబుద్ధికి ఈ ట్వీట్లు నిదర్శనమని భారత్ విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. పాకిస్తాన్‌కు నిజాయితీ లేదన్నారు. నాటకాలు ఆడడంలో పాక్‌కు ఎవరూ సాటిరారన్నారు.