అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 22: ప్రపంచ శాంతికి, భద్రతకు.. తీవ్రవాదం, ఉగ్రవాదం నుంచి అతి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టు తాను గుర్తించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ సమాజం ఐకమత్యంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటికి ఆర్థిక వనరులను అందిస్తున్న మార్గాలను నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు.
రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయిన్‌తో చర్చలు జరిపిన అనంతరం శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఫిబ్రవరి 14న జరిపిన భయంకరమయిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత తమకు మద్దతుగా నిలిచిన దక్షిణ కొరియాకు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం ఐకమత్యంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్య తీసుకొని తీరాలని, ఇందుకు సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు. అనంతరం, మరో కార్యక్రమంలో మోదీ 2018వ సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరియా వలెనే భారత్ కూడా సీమాంతర కలహాల కారణంగా గాయపడిందని అన్నారు. ‘శాంతియుత అభివృద్ధి దిశగా సాగుతున్న మా కృషి సీమాంతర ఉగ్రవాదం కారణంగా తరచుగా గాడితప్పుతోంది’ అని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. పాకిస్తాన్ అనేక ఉగ్రవాద సంస్థలకు తన గడ్డపై ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో నేరుగా ఆ దేశం పేరు ప్రస్తావించకుండానే మోదీ ఈ విమర్శలు చేశారు. భారత్ గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలం నుంచి సీమాంతర ఉగ్రవాదం వల్ల బాధపడుతుండగా, నేడు అన్ని దేశాలు ఈ భయంకరమయిన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని ఆయన పేర్కొన్నారు.
‘మానవత్వాన్ని విశ్వసిస్తున్న వారంతా చేయి చేయి కలిపి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటికి ఆర్థిక వనరులను అందిస్తున్న మార్గాలను సమూలంగా నిర్మూలించవలసిన సమయం ఆసన్నమయింది’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద సిద్ధాంతాన్ని, ప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందని ఆయన పేర్కొన్నారు.
ఆరు ఒప్పందాలపై సంతకాలు
వౌలిక సౌకర్యాల అభివృద్ధి, మీడియా, స్టార్టప్‌లు, సరిహద్దు యుద్ధం, అంతర్జాతీయ నేరాలు సహా కీలకమయిన రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్, దక్షిణ కొరియాలు శుక్రవారం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయిన్‌తో ఆయన కార్యనిర్వాహక కార్యాలయం, అధికార నివాసంలో మోదీ జరిపిన చర్యల సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. వాణి జ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత వంటి అనేక అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరువురు నేతల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగిన అనంతరం ఈ ఆరు ఒప్పందాలు కుదిరాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు