అంతర్జాతీయం

లంకలో కొనసాగుతున్న అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 17: ఈస్టర్ పర్వదినాన జరిగిన బాంబు పేలుడు సంఘటనలో అనుమానితుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే)తో సంబంధాలు ఉన్న ఒక ప్రిన్సిపల్, ఒక టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అటవీరవ్యవలోని ఓ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ అడ్డూ ఉల్ (56), టీచర్ అజీబుల్ జబార్ (47)కు ఎన్‌టీజేతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 260 మంది మృతికి కారణమైన ఆత్మాహుతి దాడిని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ప్రేరేపించాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే అసలు నిందితులను పట్టుకుంటామని పోలీస్ అధికారులు అంటున్నారు.