అంతర్జాతీయం
భారత్కు ఆస్ట్రేలియా విద్యార్థులు మొబిలిటీ పథకం కింద రానున్న 1600 మంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 November 2019
న్యూఢిల్లీ, నవంబర్ 1: ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 1,600కు పైగా మంది విద్యార్థులు ‘2020 న్యూ కొలంబో ప్లాన్ మొబిలిటి ప్రోగ్రాం’ కింద భారత్లో చదువుకోవడంతో పాటు ప్రాజెక్టులు చేయనున్నారు. ఢిల్లీలోని ఆస్ట్రేలియా ఎంబసీ ఈ విషయం వెల్లడించింది. ‘్భరత్లో ఉన్న 64 ప్రాజెక్టుల ద్వారా వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా యూనివర్శిటీలు తమ విద్యార్థులను అక్కడికి పంపించనున్నాయి. భారత్లో ప్రజలు, వ్యాపార వాతావరణం, సంస్కృతిని లోతుగా అవగాహన చేసుకోవాలని కోరుకుంటున్న కొత్త తరం యువ ఆస్ట్రేలియన్లకు మేము మద్దతిస్తున్నాం. దీనివల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి’ అని భారత్లో ఆస్ట్రేలియా హైకమిషనర్ రోడ్ హిల్టన్ పేర్కొన్నట్టు ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.