అంతర్జాతీయం

కొత్త దేశం అవతరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుకా: ప్రపంచ దేశాల పటంలో మరో కొత్త దేశం చేరింది. పపువా న్యూ గునియా నుంచి వేరుపడిన బౌగెన్‌విల్లే స్వతంత్ర రాజ్యంగా అవతరించనుంది. బుకా పట్టణం ఈ కొత్త దేశ రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాయాలు అక్కడే నెలకొంటాయని అధికారులు ప్రకటించారు. సుమారు 3 లక్షల మంది జనాభా కలిగిన బౌగెన్‌విల్లే దేశంలో బుకాతోపాటు అరావా, బూయిన్ మాత్రమే చెప్పుకోదగ్గ నగరాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 2.49,358. ఈ ఎనిమిదేళ్ల కాలంలో 3 లక్షల వరకు చేరి ఉంటుందని ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రిఫరెండం ఆఫీసర్ మోరిసినో క్లాడియో ప్రకటించారు. ఈ దేశంలో నివసిస్తున్న జనాభాలో మలేషియా నుంచి వచ్చినవారే. స్థానికులు మాత్రం టోక్ హిసిన్ భాష మాట్లాడతారు. పపువా న్యూ గునియా పిడ్గిన్ ఇంగ్లీష్‌ను మాట్లాడేవారు కూడా ఉన్నారు. దేశీయ స్థానిక ప్రజలు సుమారు 19 జిల్లాల్లో విస్తరించి ఉంటారని అంచనా. 1768లో ఈ తీర ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ద్వీపాన్ని కనుక్కొన్న ఫ్రెంచ్ నావికుడు లూయిస్ ఆంటానియో డి బౌగెన్‌విల్లే పేరుతో ఆ ద్వీపానికి నామకరణం చేశారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం జర్మనీ పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత, రెండో ప్రపంచ యుద్ధకాలంలో దీనిని తన మిలటరీ స్థావరంగా జపాన్ వినియోగించుకుంది. అనంతరం కొంతకాలం ఆస్ట్రేలియా ఆధీనంలో కొనసాగింది. 1975లో పపువా న్యూ గునియా స్వాతంత్య్రం వచ్చినపుడు బౌగెన్‌విల్లే ప్రాంతం అందులో భాగమైంది. 1969లో అతి పెద్ద రాగి గనుల సంస్థ బౌగెన్‌విల్లే కాపర్ లిమిటెడ్ ఏర్పాటైంది. విస్తారమైన ఖనిజ సంపద ఈ దేశానికి ఉంది. అందులో రాగి ప్రధానమైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రాగిలో బౌగెన్‌విల్లేది 7 శాతం కావడం గమనార్హం. ఈ నిక్షేపాలను కాపాడుకోవడానికి స్థానికులు చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అంతర్యుద్ధంలో సుమారు 20వేల మంది మృతి చెందారు. వేర్పాటువాదులు గెరిల్లా యుద్ధనీతిని అనుసరించడంతో పరిస్థితి మరింత క్షీణించింది. అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడిని తీసుకురావడంతో బౌగెన్‌విల్లేను పపువా న్యూ గునియా స్వతంత్ర రాజ్యంగా త్వరలోనే ప్రకటించనుంది.

*చిత్రాలు.. ఖనిజ సంపద బౌగెన్‌విల్లే ప్రాంతం