జాతీయ వార్తలు

ప్రియాంక చర్యతో మాజీ ప్రధానికి అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ అవమానించారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈమేరకు స్మృతి ఇరానీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ తన గంగాయాత్రలో భాగంగా ఆమె వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమె మెడలో వేసిన పూలదండను శాస్ర్తీ విగ్రహానికి వేసి నివాళులర్పించారు. తనకు వేసిన పూలమాలను లాల్ బహదూర్ శాస్ర్తీ విగ్రహానికి వేసి ప్రియాంక మాజీ ప్రధానిని అవమానించారని స్మృతి ఇరానీ పేర్కొంటూ వీడియోతో పాటు ఓ వ్యంగ్య కవితను కూడా పోస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు సైతం ప్రియాంక చర్యపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఏనాడు శాస్ర్తీని గౌరవించలేదంటూ ప్రియాంక వెళ్లిపోయిన తరువాత ఆయన విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధిచేశారు.