జాతీయ వార్తలు
ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 March 2018
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బంధీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతిచెందినట్లు లోకసభలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మోసూల్లో వీరిని పూడ్చిపెట్టిన చోటును రాడార్లు గుర్తించాయని, ఆ మృతదేహాలను పరీక్షల కోసం బాగ్దాద్ పంపించగా.. డిఎన్ఎ శాంపిల్స్ 70శాతం వరకు మ్యాచ్ అయ్యాయని అన్నారు. మృతదేహాల అవశేషాలను తీసుకువచ్చేందుకు జనరల్ వీకె సింగ్ బాగ్దాద్ వెళుతున్నారని, వాటిని ప్రత్యేక విమానంలో తీసుకువస్తారని సుష్మా వెల్లడించారు. 2014లో కిడ్నాప్ అయిన తమవారంతా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటారని భావిస్తున్న భారతీయ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కాగా మృతులకు రాజ్యసభ నిమిషం సేపు వౌనం పాటించి నివాళులర్పించింది.