ఆంధ్రప్రదేశ్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తోమాలసేవలో పాల్గొని పీఎస్‌ఎల్వీ సి46 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల కల్యాణ మండపంలో వేదపండితులు వేదాశ్విరచనం పలుకుగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కే. శివన్ మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ సి46 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.