రాష్ట్రీయం

జగన్ కేసులపై 29 వరకూ విచారణ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: జగన్ అక్రమాస్తుల కేసులో ఈ నెల 29వ తేదీ వరకు విచారణ జరపరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 29వ తేదీలోగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బదలాయించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించాలని హైకోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో జారీ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఈ కేసు విచారణను చేపట్టడాన్ని సవాలు చేస్తూ వైకాపా అధ్యక్షులు జగన్, ఆడిటర్ విజయ సాయిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.