జాతీయ వార్తలు

జంతర్‌మంతర్ వద్ద అంగన్‌వాడి వర్కర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: తమ హక్కుల సాధన కోసం నాలుగు ప్రధాన డిమాండ్‌లతో అంగన్‌వాడి వర్కర్లు, వామపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త అంగన్‌వాడి ఉద్యోగుల ఫెడరేషన్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనాన్ని పెంచాలని, వచ్చే బడ్జెట్‌లో అంగన్‌వాడిలకు నిధులను కేటాయించాలని, పదవీ విరమణ పొందిన వర్కర్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సుమారు ఐదు వేలమంది అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్లు ధర్నాలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్టల్రలో ఆందోళనలు చేపడతామని అంగాన్‌వాడిలు హెచ్చరించారు.