ఆంధ్రప్రదేశ్‌

ఆదాయం పెంచుకునే మార్గాలు అనే్వషించండి:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సామాన్యులపై భారం పడకుండా అదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అనే్వషించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆయన ఈరోజు వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాము మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించటంపై దృష్టి పెట్టామని, ఏ పనికైనా శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లో పనులు ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా పథకంపై సీఎం సమీక్ష జరిపారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోనివారు చేసుకోవచ్చని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు. గ్రామ వలంటీర్ల వద్ద జాబితా ఉంటుందని అన్నారు.