పశ్చిమగోదావరి

జగన్ డైరెక్షన్.. ముద్రగడ యాక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి
భీమవరం, మార్చి 7: ‘జగన్ డైరెక్షన్.. ముద్రగడ యాక్షన్ బాగుంది ఈ సినిమా..’ అంటూ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. మీకు ఆ పార్టీ ఏ ప్యాకేజీ ఇచ్చారని ముద్రగడ నుద్దేశించి ప్రశ్నించారు. ఒకవేళ మీకు రాజ్యసభ ఇస్తే కాపునేతలగా తాము ఎంతగానో సంతోషిస్తామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చలమలశెట్టి మాట్లాడారు. కాపునేతగా ముద్రగడ బ్లాక్‌మెయిల్ చేయడం మంచిది కాదన్నారు. ఈ నెల 11న ఆమరణ దీక్ష చేస్తానంటూ ఎవరిని మోసం చేస్తావని సూటిగా ముద్రగడను ప్రశ్నించారు. గతంలో ఆమరణ దీక్ష చేసిన సమయంలో నువ్వు కోరిన కోర్కెలను ప్రభుత్వం అంగీకరించిందని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కాపులకు మేలుచేసే విధంగా పనులు చేస్తోందన్నారు. ఇటువంటి సమయంలో మీ ఇష్టానుసారంగా మాట్లాడి ప్రభుత్వానికి, ఇటు కాపు సామాజికవర్గానికి చెడ్డపేరు తీసుకురావద్దని ముద్రగడకు హితబోధ చేశారు. కాపు కార్పోరేషన్ ద్వారా పేద కాపులకు నిర్ణీత సమయం లేకుండా ఎవరు దరఖాస్తు చేసుకున్నా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గం అభ్యున్నతికి పనిచేస్తే బాగుంటుందని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసే టిడిపి కాపులకు వెన్నంటే ఉందన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కాపులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. పార్టీ సీనియర్ నేతలు మెంటే పార్ధసారధి, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కోళ్ల నాగేశ్వరరావు, రాయలం సర్పంచ్ కోళ్ల అబ్బులు, టిడిపి పట్టణ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాథ్, వడ్డి సుబ్బారావు తదితర కాపుసామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.