ఆంధ్రప్రదేశ్‌

మా ఎమ్మెల్యేలను కొంటున్నారు : జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చుపెరిగిపోయిందని, ఇసుక మాఫియాతో అధికార పార్టీ నాయకులు, మంత్రులు చేతులు కలిపి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో బినామి పేర్లతో భూములు కొన్నాకే అమరావతిని కేపిటల్‌గా ప్రకటించిన బాబు అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేను రూ. 30 కోట్లతో మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు తీసుకువెళ్లానని ఆయన చెప్పారు.