ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల అక్రమాలపై నిగ్గు తేల్చండి:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం పనుల్లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా మున్సిపల్, రహదారులు భవనాల శాఖ, సీఆర్డీఏ కాంట్రాక్టలపైన కూడా అధ్యయనం చేయాలని అన్నారు. ప్రాజెక్టుల్లో ఎటువంటి అవినీతి జరగటానికి వీల్లేదని, అవసరమైతే పారదర్శకమైన టెండర్ల విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాజెక్టులపై తొలుత దృష్టిసారించాలని అన్నారు. వ్వవస్థను బాగుచేసుకుందామని, అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యానని అన్నారు.