ఆంధ్రప్రదేశ్
పారదర్శికంగా విద్యుత్ ఒప్పందాలు:జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 26 June 2019
అమరావతి: విద్యుత్ ఒప్పందాలు పారదర్శికంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై సమీక్ష జరిపారు. సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్ల వ్వవహారంపై పలు సూచనలు చేశారు. బిడ్డింగ్ ధరలకన్నా అధిక రేట్లుకు ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించారు. ఈ అక్రమాల వల్ల రూ.2,636 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిని రికవరీ చేయాలని అన్నారు. విద్యుత్ ఒప్పందాలు చేసిన అప్పటి ఉన్నతాధికారి, మంత్రి, సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.