జాతీయ వార్తలు
కాశ్మీర్ శాంతి భద్రతల పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 June 2018
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నఆయన వెంట కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, జమ్మూ కశ్మీర్ జాయింట్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్, పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి పర్యటన తమకు కీలకమైనదనీ... ఆయన పర్యటన కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు సీఆర్పీఎఫ్ ఐజీ రవిదీప్సింగ్ సాహి పేర్కొన్నారు.