రాష్ట్రీయం

మహానందీశ్వరుని సన్నిధిలో జస్టిస్ చలమేశ్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది/ఆళ్లగడ్డ, డిసెంబర్ 12: సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ కర్నూలు జిల్లాలోని మహానందీశ్వరుడు, నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. శనివారం ఆయన మహానందికి చేరుకోగా ఎఇఓ మధు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చలమేశ్వర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, మెమొంటో అందజేశారు. అనంతరం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని చలమేశ్వర్ దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు జడ్జికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. దిగువ అహోబిలంలో కొలువుదీరిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవారు, ర్లను, ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలిసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అధికారులు స్వామివారి జ్ఞాపిక అందజేశారు.