జాతీయ వార్తలు

ప్రభుత్వానికి అఖిలపక్షం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని అఖిలపక్ష సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు తెలిపాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటీకి అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. పూల్వామా దాడి వివరాలను, కేంద్రం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. దేశ సమగ్రతను కాపాడుతూ ఉగ్రవాదులపై పోరాడుతున్న సైనిక బలగాలకు అండగా ఉంటామని చెప్పారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో ఎన్నో విషయాలపై భేదాభిప్రాయాలు ఉండవచ్చు. కాని దేశ భద్రత విషయంలో మాత్రం మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు.