ఆంధ్రప్రదేశ్‌

పిల్లల తగాదాలో ఇద్దరు బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఇద్దరు పిల్లల మధ్య గొడవ ఫలితంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషాద సంఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం చిముడుపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు కొర్ర మత్స్యరాజు, కొర్ర కొట్టయ్యల కొడుకులిద్దరూ సోమవారం ఆడుకుంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తన కొడుకును ఎందుకు కొట్టావంతూ మత్య్యరాజు ఈరోజు తెల్లవారు జామున కొట్టయ్య కుమారుడు వినయ్‌పై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు వినయ్ వెంటనే మరణించాడు. ఈ సంగతి తెలిసి కొట్టయ్య ఆవేశంతో ఊగిపోతూ మత్స్యరాజు తలపై కర్రతో బలంగా కొట్టాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో మత్స్యరాజు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలిశాక పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.