జాతీయ వార్తలు

కాశ్మీర్‌లోయలో రెండోరోజూ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: హంద్వారాలో పోలీసు కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లోయలో రెండోరోజు గురువారం కూడా బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలను మూసివేశారు. హంద్వారాలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించినందుకు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. పుకార్ల వల్ల పరిస్థితి విషమించకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తచర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.