రాష్ట్రీయం

ఉద్యోగాల పేరుతో రెండు కోట్లు స్వాహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, డిసెంబర్ 24: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అందమైన మోసం చేసిన ఫైరవీకారులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గురువారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో హుస్నాబాద్ సిఐ దాసరి భూమయ్య నిందితుల వివరాలను వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తోట సత్యనారాయణ, పిట్టల సునీల్, ఎల్‌ఎండికి చెందిన కత్తి వెంకట్‌రెడ్డి, కరీంనగర్‌కు చెందిన బిజిగిరి శ్రీనివాస్ (ఓ స్థానిక పత్రిక విలేఖరి), రఫీక్‌లు ఒక ముఠాగా ఏర్పడినారన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా అక్రమ మార్గాన ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హుస్నాబాద్, చిగురుమామిడి, మానకొండూర్, తిమ్మాపూర్, కోహెడ మండలాలకు చెందిన నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపిస్తూ మీకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరింత డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సమాచారం అందించగా వీరిపై నిఘా పన్ని వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, సునీల్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇరువురు పరారీలో ఉండగా, వారికోసం గాలిస్తున్నామన్నారు.