కడప

బాలయ్యకు బ్రహ్మరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, మార్చి 17: కడపజిల్లా పర్యటనలో భాగంగా గురువారం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు రైల్వేకోడూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పట్టణంలోని టోల్‌గేట్ సెంటర్ నుంచి పార్టీ కార్యాలయం వరకు వేలాది మంది కార్యకర్తలు మేళతాళాలతో ఆయనను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ దివంగత సిఎం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టి రామారావు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. బాలకృష్ణ వచ్చాడన్న సమాచారంతో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయానికి రావడంతో తోపులాట జరిగింది. బాలకృష్ణను పార్టీ ఇన్‌ఛార్జి కె.విశ్వనాధనాయుడు ఆయన కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్త విశే్వశ్వరనాయుడు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామచంద్రయ్యనాయుడు, ఓబులవారిపల్లె ఎంపిపి వెంకటేశ్వరనాయుడు, పెనగలూరు ఎంపిపి ఇర్షాద్‌బేగం, పార్టీ నాయకులు ఇందీవర్‌నాయుడు, జి.సుబ్బరాయుడు, చలమయ్యనాయుడుతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాలయ్యను పూలమాలలతో సత్కరిస్తూ ముంచెత్తారు. మరోవైపు బాలయ్య తన అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగారు. కాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఛైర్మన్ లింగారెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో పాటు జిల్లాకు చెందిన పలువురు నాయకులు బాలయ్యను కుక్కలదొడ్డి వద్ద ఘన స్వాగతం పలికారు. సిఐ రసూల్‌సాహెబ్ ఆధ్వర్యంలో ఎస్సైలు శివప్రసాద్, రమేష్‌బాబు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే టిడిపి ఇన్‌ఛార్జితో పాటు తెలుగుయువత నాయకులు కట్టాబాలాజీ పోటాపోటీగా పట్టణంలో బాలకృష్ణకు భారీ ఎత్తున స్వాగత బ్యానర్‌లు ఏర్పాటు చేశారు.