తెలంగాణ

కేసుల మాఫీ కోసమే జగన్ దిల్లీయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దిల్లీ వెళతానంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం కొంతమంది పెద్దలను కలుస్తుంటారని టిడిపి నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, జగన్ వ్యవహార శైలి నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారన్నారు. కరవు సమస్యపై ధర్నాలు చేస్తామని, ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేస్తామని జగన్ చెబుతున్నా, ఇవన్నీ రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసమేనని గాలి అన్నారు.